కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలోనూ, కొండ ప్రాంతమైన ఇడుక్కి జిల్లాలోనూ కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల మరణించిన వారి సంఖ్య 26కుపెరిగిందని రాష్ట్ర డిజాస్టర్ కంట్రోల్ రూమ్ అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.