హైదరాబాద్ : మతోన్మాద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కోల్కతాలోని బాంక్షాల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఐపిసి సెక్షన్లు 153 ఎ / 295 ఎ కింద అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఒవైసీపై పిటిషన్ దాఖలైంది. గురుగ్రామ్లో ఒక ముస్లిం యువకుడి గడ్డాన్నికొందరు గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా షేవింగ్ చేయించడంపై ఒవైసీ హైదరాబాద్లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ”మీరు మా కంఠం కోసినా మేం ముస్లింలుగానే ఉంటాం.. మిమ్మల్ని కూడా ఇస్లాంలోకి మార్చి గడ్డం పెంచుకునేలా చేస్తాం” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పిటిషన్ దాఖలైంది.