నల్గొండ జిల్లాలోని బీబీ నగర్ మండలం కొండమడుగు వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బీటెక్ విద్యార్థి మృతి చెందగా ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వస్తున్న కారును గమనించకుండా బైక్ పై ప్రయాణిస్తున్న బీటెక్ విద్యార్థులు రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కారు బైక్ ను ఢీ కొట్టడంతో ముగ్గురు విద్యార్థులు ఎగిరి కొద్దిమీటర్ల దూరంలో పడ్డారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి బంధువులు తమకు న్యాయం చేయాలని కోరుతూ హైవేపై ఆందోళన చేపట్టారు.