ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైక్‌ను ఢీ కొట్టిన కారు ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 10, 2018, 11:09 AM

నల్గొండ జిల్లాలోని బీబీ నగర్‌ మండలం కొండమడుగు వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బీటెక్‌ విద్యార్థి మృతి చెందగా ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వస్తున్న కారును గమనించకుండా బైక్‌ పై ప్రయాణిస్తున్న బీటెక్‌ విద్యార్థులు రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కారు బైక్‌ ను ఢీ కొట్టడంతో ముగ్గురు విద్యార్థులు ఎగిరి కొద్దిమీటర్ల దూరంలో పడ్డారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి బంధువులు తమకు న్యాయం చేయాలని కోరుతూ హైవేపై ఆందోళన చేపట్టారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com