కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలువురు చనిపోయారు. 54వేల మంది నిరాశ్రయులయ్యారు. రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి. హైవేలు ధ్వంసమయ్యాయి. వరద బీభత్సంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కేరళలో సగభాగం వరద ప్రాంతంగా మారిందని ప్రభుత్వం అంటోంది. రాష్ట్రంలోని 40 నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆర్మీ, నావీ, కోస్ట్ గార్డ్ సహకారంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. పెరియార్ నది ప్రమాద సూచికను దాటి ప్రవహిస్తుండటంతో కొచ్చి దగ్గరి వెల్లింగ్టన్ దీవి మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. అధికారులు పడవలలో తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
నాలుగు రోజులుగా రాష్ట్రమంతా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడిన చోట్ల కొందరు గల్లంతయ్యారు. 439 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం అందిస్తున్నారు. కోజికోడ్, వాయినాడ్ జిల్లాల్లో ఆర్మీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇడిక్కి జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇడిక్కి ఆనకట్ట నుంచి భారీగా నీటి విడుదలే ఇందుకు కారణం.
మొత్తం 58 చిన్నా, పెద్దా ఆనకట్టల్లో నీటి నిల్వలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. ఇడిక్కి ఆనకట్టలో అన్ని గేట్లు ఎత్తివేయడం 26ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. సీఎం విజయన్ అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కేంద్రం ఆల్ఫోన్స్ కన్నమ్ థానమ్ కేరళ వరద పరిస్థితిని హోంమంత్రి రాజ్నాథ్కు వివరించారు. రాజ్నాథ్ ఈరోజు కేరళలో ఏరియల్ సర్వే చేసే అవకాశం ఉంది.