కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వేములవాడలో హోంమత్రి నాయిని నర్సింహారెడ్డి పర్యటించారు. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.400కోట్లు ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. గత ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. కొత్తగా 21 అగ్నిమాపక కేంద్రాలు మంజూరు చేశాం. కొత్తగా ఫైర్ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చాం. కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్ కూడా రాదు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శం. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రైతు బీమా, రైతుబంధు తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన తెలిపారు.