హైదరాబాద్: గోల్కొండ కోటలో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల గౌరవందనాన్ని సీఎం స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. అలాగే ఈరోజు రైతు బీమా, బీసీలకు రుణాలు, ఉద్యోగాల కల్పన, రైతుబంధు రెండో దశ వివరాలను సీఎం వెల్లడించనున్నారు.