దేశ వ్యాప్తంగా ఇవాళ 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్నారు. స్వాతంత్ర్య వేడుకలకు దేశ ప్రజలు సిద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లి ఎర్రకోట వద్ద మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల్లో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా జరుపుకోనున్నారు. అన్ని రాష్ట్రాలలో గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు.