కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ నిన్న హైదరాబాద్లో మీడియా ఎడిటర్స్తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో కేసీఆర్ పరిపాలనపై పలు ఆరోపణలు చేశారు రాహుల్. ఈ వ్యాఖ్యలపై మంత్రి హరీష్రావు ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్క్రిప్ట్ రైటర్తో జాగ్రత్తగా ఉండాలని రాహుల్కు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో అంచనా వ్యయాన్ని రూ. 38వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పెంచారని తమ స్క్రిప్ట్ రైటర్ చెప్పారన్నారు. కానీ ప్రాణహిత- చేవెళ్ల తొలి జీవో రూ. 17వేల కోట్లకు జారీ చేశారని వారు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఏడాది వ్యవధిలో కనీసం ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టకముందే 2008లో 38వేల కోట్లకు…2010లో 40వేల కోట్లకు డీపీఆర్ సిద్ధం చేశారని చెప్పారు. ప్రాజెక్ట్ వ్యయం ఆ విధంగా ఎందుకు పెంచారో రాహుల్ చెప్పగలరా అని మంత్రి ప్రశ్నించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ. 80,190 కోట్లకు సీడబ్ల్యూసీ ఆమోదించింది.. లక్ష కోట్లకు కాదు…ఈ విషయం మీ స్క్రిప్ట్ రైటర్కు తెలియదా అంటూ రాహుల్పై మంత్రి హరీష్రావు ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Dear @RahulGandhi Ji, beware of your script writers
you have told that in the name of redesign Kaleshwaram project cost is enhanced to 1 Lack crores from 38K Crores.
your script writers had forgotten that Pranahitha - Chevella first GO was issued for 17K Crores.
— Harish Rao Thanneeru (@trsharish) August 15, 2018