హైదరాబాద్: నగరంలోని రెయిన్బజార్ యాఖత్పురాలోని బ్రాహ్మన్వాడీలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసు పెట్రోలింగ్ రక్షక్ వాహనం ఉదయం రోడ్లు ఊడుస్తున్న జీహెచ్ఎంసీ కార్మికురాలిని ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కార్మికురాలి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.