నిజామాబాద్ జిల్లా పోచంపాడ్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ( ఎస్సారెస్పీ)కు ఇన్ఫ్లో పెరిగింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరిగింది. 7777 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1063.40 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.879 టీఎంసీల నీట నిల్వ ఉంది.