తుంగభద్ర డ్యామ్కు వరద ఉధృతి పెరిగింది. తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 110 టిఎంసిలు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 92.8 టిఎంసిలకు చేరింది. అధికారులు 33 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.