న్యూఢిల్లి : మాజీ ప్రధాని వాజ్పేయి ఆరోగ్యం విషమంగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా ఢిల్లికి వెంటనే తరలి రావాలని ఆ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. వాజ్పేయి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో బిజెపి వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. ఆ పార్టీ సీనియర్ నేతలంతా ఎయిమ్స్కు చేరుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.