కొల్లాపూర్: కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్నారు. పలు గ్రామాల్లో కంటి వెలుగు, రైతు భీమా పత్రాల పంపిణీపై మంత్రి సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలను సందర్శించి ప్రజలతో ముచ్చటించి, వారి అభిప్రాయం తెలుసుకున్నారు. అనంతరం సింగపట్నం చెరువు కింద వరినాట్లు వేస్తున్న వారితో కలిసి మంత్రి ఉత్సాహంగా నాట్లు వేశారు.