హైదరాబాద్: నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. చందానగర్ పీజేఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. కంటి పరీక్షకు వచ్చిన స్థానికులతో మంత్రి ముచ్చటించారు. అనంతరం హఫీజ్పేటలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని సందర్శించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాసేపట్లో ఫిల్మ్నగర్ బస్తీలో మంత్రి పర్యటించనున్నారు.