న్యూఢిల్లి : మాజీ ప్రధాని వాజ్పేయి ప్రసంగిస్తుంటే చూడాలని, ఆయన ప్రసంగాలు అత్యద్భుతంగా ఉంటాయని ఆయన మేనకోడలు కాంతి మిశ్రా అన్నారు. వాజ్పేయి ఆరోగ్యం క్షీణించడం పట్ల ఆమె కన్నీరుమున్నీరయ్యారు. మీడియా కాంతి మిశ్రాను పలుకరించినప్పుడు తన హృదయంలో వాజ్పేయి ప్రసంగం ముద్ర వేసుకుపోయిందన్నారు. వాజ్పేయితో తమకున్న అనుబంధాన్ని ఆయన బంధువులు గుర్తు చేసుకున్నారు.