రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నహెచ్చరికల నేపథ్యంలో సాగునీటి శాఖ ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్రావు ఆదేశించారు. ప్రాజెక్టులు, చెరువులు, రిజర్వాయర్లలోకి చేరుతున్న వరదనీటిపై సాగునీటిశాఖ ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఈలు, ఈఈలు గంటగంటకూ పరిస్థితిని సమీక్షించాలని, గండ్లు పడే చెరువులను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.