హైదరాబాద్ : తెలంగాణ మంత్రిగా కేటీఆర్ అనర్హుడని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద అన్నారు. కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని ఆమె అన్నారు. ఇన్నిరోజులు మహిళల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనతో మహిళా సంఘాలకు రూ. 930 కోట్లు విడుదల చేశారని నేరెళ్ల శారద అన్నారు. రాష్ట్రంలోని సమస్యలు కేసీఆర్ కు కనిపించడం లేదన్నారు.