వికారాబాద్: తాండూరు మండల పరిషత్లో వికారాబాద్ జిల్లా స్థాయి ఇంటింటికి అంగన్ వాడీ కార్యక్రమాన్ని మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి.. రాష్ట్రంలో మహిళ, శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్ల నిధులు, పథకాలను అమలు చేస్తున్నదన్నారు.
అంగన్ వాడీ టీచర్లు, ఆయాల జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి స్పష్టం చేశారు. అంగన్ వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు అన్ని గ్రామాల్లో ఇంటింటికి అంగన్వాడి కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ప్రతి ఇంట్లో ఉన్న 5 ఏండ్ల లోపు పిల్లల వివరాలను తీసుకొని వారి ఆరోగ్య సమస్యల మీద అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లాలో 36 వేల మంది పిల్లల సర్వేతో పాటు గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి తెలిపారు.