ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో రెడ్ అలర్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 17, 2018, 09:44 AM

కొచ్చి: కేరళలో పరిస్థితి అదుపు దాటింది. భారీ వర్షాలతో ఆ రాష్ట్రం అతలాకుతలమవుతున్నది. వరుణుడి ధాటికి రాష్ట్రమంతా జలమయం అయ్యింది. దీంతో ఇవాళ ఆ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మొత్తం 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒక్క కాసర్‌ఘడ్ జిల్లాలో మాత్రం రెడ్ అలర్ట్ ప్రకటించలేదు. ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాలకు రేపటి కోసం కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇవాళ కూడా ప్రధాని మోదీ ఆ రాష్ట్ర సీఎం విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రెస్క్యూ ఆపరేషన్ గురించి ప్రస్తావించారు. ఇవాళ రాత్రికి మోదీ.. కేరళకు వెళ్లనున్నారు. ఆయన రేపు ఏరియల్ సర్వే చేస్తారు. ఈ శ‌తాబ్ధంలోనే ఇవి అత్య‌ధిక వ‌ర్షాలు అని ఇప్ప‌టికే నిపుణులు తేల్చేశారు. అనేక ప్రాంతాల్లో ఇండ్లు నీట మునిగాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com