న్యూఢిల్లి : మాజీ ప్రధాని వాజ్పేయి అంత్యక్రియలు నేటి సాయంత్రం రాష్ట్రీయ శక్తిస్థల్లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లి పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాజ్పేయి అంతిమ యాత్ర సజావుగా కొనసాగడానికి వీలుగా పలు ప్రధాన మార్గాల్లో ప్రజలను అనుమతించబోమని ఢిల్లి డిసిపి మాధూర్ వర్మ ఎప్పారు. వాజ్పేయికి చివరిసారిగా నివాళులర్పించడానికి వచ్చే వారి వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.