న్యూఢిల్లి : పాకిస్తాన్తో స్నేహ సంబంధాలు బలపడాలని వాజ్పేయి ఆకాంక్షించారని, అది చూడకుండానే ఆయన మృతి చెందారని జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్ద్లుల్లా అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం, పాక్లోని ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం వాజ్పేయి కలను సాకారం చేస్తుందని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు. అదే వాజ్పేయికి నిజమైన నివాళి అని ఫరూఖ్ అబ్దుల్లా చెప్పారు.