వచ్చే సంవత్సరం నాటికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా కరువులేని జిల్లాగా మారబోతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు . కరీంనగర్ ఎల్ఎండి గెస్ట్ హౌస్లో అధికారులతో ఆయన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈటెల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు జిల్లాలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించామన్నారు. సెప్టెంబర్ చివరి నాటికి ఎల్లంపల్లి నీరు అందిస్తామని తెలిపారు. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించాం. ఆగస్టు మాసంలో ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నందున పంటలకి నష్టం లేకుండా పండే అవకాశం ఉందన్నారు.