చిగురుమామిడి: రాష్ట్ర నీటిపారుదల శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్లు శనివారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తారని ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్ తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోపాటు ఎమ్మెల్యే అధికార నివాస భవనాన్ని మంత్రులు ప్రారంభించనున్నారు. అనంతరం హుస్నాబాద్ మార్కెట్లో నియోజకవర్గ స్థాయి విస్తృత కార్యకర్తల సమావేశం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.
జిల్లెల్లగడ్డ వద్ద సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, అక్కన్నపేటలో పోలీస్స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ, కోహెడ మండలంలో చెక్డ్యాంల నిర్మాణం, మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో రూ. 33.40కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరుగుతాయన్నారు. ఈకార్యక్రమాల్లో మంత్రులతోపాటు ఎంపీ వినోద్, రాజ్యసభసభ్యులు కెప్టెన్ లక్ష్మికాంతారావు, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్రెడ్డి, నారదాసు లక్ష్మణ్రావులు హాజరు కానున్నారు. పర్యటనను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు.