భూపాలపల్లి: మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో పెరుగుతున్న నీటి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ ఆమయ్ కుమార్, ఆర్డీవో వీరబ్రహ్మచారి, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం ఇక్కడ గోదావరి నీటిమట్టం 10 మీటర్లకు చేరుకున్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు కాజువేల మీదుగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాజువేల వద్ద భద్రతను పెంచారు. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం జిల్లెలవాగు కాజువే వద్ద ముందు జాగ్రత్త చర్యగా అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేశారు.