ఆదిలాబాద్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి అక్కడి ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులైయ్యారు. వరద బాధితులకు ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరంలో వారు ఆశ్రయం పొందుతున్నారు. వరద బాధితులను మంత్రి జోగురామన్న పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వరద బాధితులకు ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేసి భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు.