ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాజపేయి జ్ఞాపకార్థం ఢిల్లీలో స్మారక చిహ్నం!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 17, 2018, 03:48 PM

న్యూఢిల్లీ : భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జ్ఞాపకార్థం ఢిల్లీలో స్మారక చిహ్నం ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వాజపేయి(93) నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని స్మృతి స్థల్ వద్ద వాజపేయి జ్ఞాపకార్థ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. లేదా మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రు(శాంతి వనం), లాల్‌బహదుర్ శాస్త్రి(విజయ్ ఘాట్) మధ్య స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. లేదా యమునా నది ఒడ్డున రాజ్‌ఘాట్ వద్ద సమాధితో పాటు వాజపేయి మెమోరియల్‌ను ఏర్పాటు చేయాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com