న్యూడిల్లీ : భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మృతిపట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా, రష్యా, బ్రిటన్, జపాన్ సహా సార్క్ దేశాధినేతల సంతాపం ప్రకటించారు. భారత్, అమెరికా సంబంధాలు మెరుగుపరచడంలో వాజ్పేయి కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా అమెరికా దౌత్య కార్యాలయం గుర్తు చేసుకుంది. భారత రాజకీయాల్లో వాజ్పేయి పేరు ఓ అంతర్భాగమైందని, ప్రపంచం ఒక గొప్ప రాజనీతిజ్ఞుడ్ని కోల్పోయిందని రష్యా వ్యాఖ్యానించింది. ఇరుదేశాల మధ్య సహజసిద్ధ సంబంధాలు ఉన్నాయని వాజ్పేయి అనేవారని అమెరికా దౌత్య కార్యాలయం ప్రకటించింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మృతికి పాకిస్తాన్ ప్రధానిగా పదవి చేపట్టనున్న మాజీ క్రికెటర్ ఇమ్రాన్ఖాన్ సంతాపం తెలిపారు. భారత్, పాకిస్తాన్ల మధ్య సత్సంబంధాలు మెరుగుపడటానికి వాజ్పేయి ఎంతో కృషి చేశారని ఇమ్రాన్ఖాన్ అన్నారు.