హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకులకు కామన్ ఎజెండా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద దుయ్యబట్టారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనతో ఊపు వచ్చిందని కాంగ్రెస్ నాయకులు ఊహల్లో ఉన్నారని రాహుల్ సభా వేదికపై ఉన్న నాయకులంతా ముఖ్యమంత్రి అభ్యర్థులుగానే వ్యవహరించారని ఎమ్మెల్యే వివేకానంద ఎద్దేవాచేశారు. ప్రాజెక్టులపై వందల కేసులు వేసి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిందని వివేకానంద జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు.