హైదరాబాద్ : కరీంనగర్ నగరాన్ని కాంగ్రెస్ నాయకులు బొందల గడ్డగా మార్చారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. కరీంనగర్కు మంత్రి కేటీఆర్ అధిక నిధులు కేటాయించి సుందరంగా తీర్చిదిద్దారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కేటీఆర్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్కు లేదని చెప్పారు. పొన్నం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ పర్యటనతో ఊపు వచ్చిందని కాంగ్రెస్ నాయకులు ఊహల్లో ఉన్నారని ఎమ్మెల్యే వివేకానంద పేర్కొన్నారు. రాహుల్ ఇక్కడే అడ్డా వేసినా టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరు. కాంగ్రెస్ నాయకులకు కామన్ ఎజెండాలేదు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేదు. ప్రాజెక్టులపై కేసులు పెట్టి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. మంత్రి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు. టీవీలు, పేపర్లలో కనిపించడం కోసం కాంగ్రెస్ నాయకులు ప్రెస్మీట్లు పెడుతున్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు 100 సీట్లు గెలిచి చరిత్ర సృష్టిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులతో మేం ఎలాంటి చర్చలకైనా సిద్ధమని సవాల్ విసిరారు.