హైదరాబాద్: సాగర్ ఎడమ కాలువ రైతులకు నీరిచ్చే విషయంపై మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాన్ని జలసౌధలో నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్ రెడ్డి, సాగునీటిశాఖ ఇంజినీర్లు, ఎంపీలు గుత్తా సుఖేందర్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.