శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి 3,62,098 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను 878.80 అడుగులకు చేరి, 192 టీఎంసీలకు నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిలువ సమార్థ్యం 215.8 టీఎంసీలు. ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లో 1,04,392 క్యూసెక్కులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా ఏపీ వపర్ హౌజ్కు 32382 క్యూసెక్కులు, తెలంగాణ వపర్ హౌజ్కు 42378క్యూసెక్కులు, హంద్రీనివా ప్రాజెక్టుకు 2025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 26000 క్యూసెక్కులు, మహా-త్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 74,232 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.