కేరళను ఇంకా వర్షాలు వీడటం లేదు. ప్రకృతి విపత్తుకు ఇప్పటికే 324 మంది మృతి చెందినట్లు ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ వెల్లడించారు. ఈ శతాబ్ద కాలంలోనే కేరళలో అత్యంత వర్షపాతం నమోదైంది. వరద ప్రభావిత ప్రాంతాలను సమీక్షించడానికి ప్రధాని నరేంద్రమోడీ కొచ్చి విమానశ్రయానికి చేరుకున్నారు. 42 నావీ, 16 ఆర్మీ, 28 కోస్ట్గార్డ్, 39 జాతీయ విపత్తు నివారణ బృందాలు సహాయక చర్యల్లో నిమగమయ్యాయి. మరో 14 ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కేరళకు చేరుకోనున్నాయి. పెరియార్ నది, దాని ఉపనదుల నుండి వరద నీరు చేరుకోగా, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అలప్పుజ, ఎర్నాకుళం, త్రిశూర్, పత్తణ్ణంతిట్ట జిల్లాల్లో రహదారులన్నీ మునిగిపోయాయి. వేలాది మంది ప్రజలు ఇంటి పైకప్పులపై, చెట్లను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలోని టెలికాం ఆపరేటర్లు ఉచిత కాల్స్, డేటాను ప్రకటించారు.