ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద ప్రాంతంలో పర్యటిస్తున్న మంత్రి రామన్న, కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 18, 2018, 10:20 AM

ఆదిలాబాద్ పట్టణంలోని వరద ప్రాంతాల్లో మంత్రి జోగు రామన్న పర్యటిస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని పదిహేను వార్డులో కాలినడకన తిరుగుతూ వరద బాధితులను పరామర్శించాడు. శాంతినగర్ కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా సర్వం కోల్పోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. 


కలెక్టర్ దివ్యాదేవరాజన్ వరద ప్రభావిత గ్రామాలను సందర్శించారు. బాధితులను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముంపు గ్రామాల ప్రజల కోసం ఆదిలాబాద్, జైనథ్, బేల, ఇచ్చోడ మండలాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి భోజనం, ఇతర సౌకర్యాలను కల్పించారు. కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబర్ 18004251939 ఏర్పాటు చేశారు. మండలానికో ఓ ప్రత్యేకాధికారిని నియమించారు. మరో రెండురోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. పెన్‌గంగా పరీవాహక ప్రజలను అప్రమత్తం చేశారు. వరద బాధితులను ఆదుకుంటామని మంత్రి జోగు రామన్న హామీ ఇచ్చారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com