ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీవీని చివరి ఘడియల్లో అవమానించారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 18, 2018, 11:11 AM

అధిష్ఠానం చెప్పినదానికి ఓకే చెప్పడం తప్ప మరేమి స్పందించకుండా కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ శిక్షణ ఇచ్చిందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని పీవీ కన్నుమూసిన తర్వాత ఆ పార్టీ ఆయన్ను అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని వాజపేయి అంత్యక్రియలను బీజేపీ నిర్వహించిన తీరును చూసి ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. వాజపేయి అంత్యక్రియలు చూసిన తర్వాత పీవీ చివరి ఘడియలను తలుచుకొని నా రక్తం మరిగిపోతోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సిగ్గుంటే తమ పార్టీ పెద్దలు చేసిన పనికి క్షమాపణలు కోరాలి. మీరేమంటారు కేటీఆర్ గారు? అని ప్రశ్నించారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ పీవీని చివరి ఘడియల్లో అవమానించారు. ఆ పరిణామంపై స్పందించే హుందాతనం, ధైర్యం వెన్నెముక లేని ఈ కాంగ్రెస్ నేతలకు లేకపోవడం బాధాకరం అని కేటీఆర్ పేర్కొన్నారు. పీవీ విషయంలో కాంగ్రెస్ నేటికీ ప్రాయశ్చిత్తం చేసుకోలేదన్న జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ అభిప్రాయంతో ఆయన ఏకీభవించారు.














SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com