సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రయాణించే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రైలును లింగంపల్లి వరకు పొడిగించారు. సెప్టెంబర్ 5 నుంచి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ లింగంపల్లి నుంచి బయలుదేరుతుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. 12734 నంబరు గల నారాయణాద్రి ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 5 సాయంత్రం 5.15కి లింగంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.05 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 6.25 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.15కి లింగంపల్లి చేరుకుంటుంది.