న్యూ బోయిన్పల్లిలో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. బ్రోకర్, ఇద్దరు విటులను అరెస్టు చేసి ముగ్గురు యువతులను రక్షించారు. శిరీష అనే మహిళ కొంతకాలంగా వ్యభిచార నిర్వాహకురాలిగా పనిచేస్తోంది. కరీంనగర్కు చెందిన సింగిరెడ్డి భరత్రెడ్డి(24) నగరానికి చేరుకొని ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం న్యూ బోయిన్పల్లి, జయా ఎన్క్లేవ్లోని జేఎస్ఆర్ రెసిడెన్షీలో ఫ్లాట్ అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్లో తనకు ఉన్న పరిచయాలతో శిరీష యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. ఈ దందాలో సబ్ బ్రోకర్గా పనిచేస్తున్న భరత్రెడ్డి కస్టమర్లను తరలించి కమీషన్ తీసుకుంటున్నాడు. సమాచారం అందుకున్న నార్త్జోన్ టాస్క్ఫోర్స్ బృందం, బోయిన్పల్లి పీఎస్ మహిళా కానిస్టేబుళ్లతో కలిసి ఫ్లాట్పై శుక్రవారం దాడి చేశారు. సింగిరెడ్డి భరత్రెడ్డి, విటులు జల్లిబాల పడిగరావు(44), ఉప్పలపాటి ఆకాశ్(24)ను అరెస్టు చేశారు. వ్యభిచార కూపంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు, పశ్చిమ బెంగాల్క చెందిన ఒక యువతిని రక్షించారు. నిందితుల నుంచి రూ. 5,500, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితురాలు శిరీష పరారీలో ఉన్నారు.