యూఏఈ అభివృద్ధిలో కేరళ ప్రజల భాగస్వామ్యం ఉందని, ఆ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిన ప్రత్యేక బాధ్యత తమపై ఉందని యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయద్ అలీ నహ్యాన్ అన్నారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు జాతీయ స్థాయిలో ఓ ఎమర్జిన్సీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కమిటీకి ఛైర్మన్ గా ఎమిరేట్స్ రెడ్ క్రాస్ క్రెసెంట్ (ఈఆర్సీ) ఉంటుందని, ఇందులో పలు ఎన్జీవోలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ ఆపద సమయంలో కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఎమిరేట్స్ ప్రజలు, ప్రవాస భారతీయులు ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. కేరళలో ఈ శతాబ్దంలోనే ఎన్నడూ లేని వర్షాలు కురుస్తున్నాయి. బక్రీద్ జరుపుకోవాల్సిన సమయంలో ఇలాంటి ఘోరవిపత్తు వచ్చిందని, ఇలాంటి సమయంలో బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.