మరోసారి నగరంలో డ్రగ్స్ కలకలం రేపాయి. తాజాగా హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. ఈ డ్రగ్స్ను సరఫరా చేస్తున్న రాజేశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడి వద్ద నుంచి భారీ స్థాయిలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా కర్ణాటక నుంచి మత్తు మందు ట్యాబెట్లను తెచ్చి రాజేశ్ ఇక్కడ విక్రయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. డ్రగ్స్ నిర్మూలించేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వాటిని సరఫరా ఆగకపోవడం అధికారులకు పెద్ద తలనొప్పిని తెప్పిస్తోంది.