కర్ణాటకలోని కొడ్గావ్ జిల్లాను గత ఐదారు రోజుల నుంచి వర్షాలు ముంచెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో ఇవాళ కర్ణాటక సీఎం కుమారస్వామి.. కొడ్గావ్ వరద పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. మొత్తం 11 వేల ఇండ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ఆరుగురు మృతి చెందినట్లు తెలిపారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మొత్తం 1000 మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, ఫైర్ సిబ్బందితో పాటు హోంగార్డులు, ఎన్సీసీ క్యాడెట్స్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.