హైదరాబాద్: రాఫెల్ కుంభకోణంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి మండిపడ్డారు. రాహుల్తో జరిగిన సమావేశంలో రాఫెల్ డీల్పై చర్చ జరిగిందని ఆయన తెలిపారు. రాఫెల్ డీల్లో 41 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, రాఫెల్ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రకృతి విలయంలో చిక్కుకున్న కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు వచ్చే నెల జీతాన్ని విరాళంగా ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ పీసీసీ తరపున కూడా కేరళకు సహాయం అందిస్తామని ఉత్తమ్ చెప్పారు.