ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాఫెల్ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం: ఉత్తమ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 18, 2018, 05:06 PM

హైదరాబాద్: రాఫెల్ కుంభకోణంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‎రెడ్డి మండిపడ్డారు. రాహుల్‌తో జరిగిన సమావేశంలో రాఫెల్ డీల్‌పై చర్చ జరిగిందని ఆయన తెలిపారు. రాఫెల్‌ డీల్‌లో 41 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, రాఫెల్ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రకృతి విలయంలో చిక్కుకున్న కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు వచ్చే నెల జీతాన్ని విరాళంగా ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ పీసీసీ తరపున కూడా కేరళకు సహాయం అందిస్తామని ఉత్తమ్ చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com