ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టులోకి 59,327 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వచ్చిచేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1071.70 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.313 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 32.487 టీఎంసీల నీరు నిల్వ ఉంది.