వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం సోమాలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.