నిజామాబాద్ జిల్లాలోని వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్ర్ గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పోలీస్ కమీషనర్ కార్తికేయ ఆధ్వర్యంలో 187 మంది పోలీసు సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో మొత్తం 33 బైక్ లు, ఆటోలు తొమ్మిది, రెండు కార్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. ఎవరు కూడా ఎలాంటి పరిచయం, ఆధారాలు లేనిదే ఇల్లు కిరాయికి ఇవ్వవద్దన్నారు. కొత్త వ్యక్తి కనబడితే దగ్గరలోని పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఎవరు కూడా తమ వాహనాలను ఇతరులకు ఇవ్వరాదని, ఇతరులు వాహనాలను తీసుకొని వెళ్లి నేరం చేస్తే వాహన యజమానిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది అన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలనన్నారు.