సంగారెడ్డి : భారీ వరదలు ముంచెత్తున్న కేరళ రాష్ట్రానికి తమ వంతుగా బాసటగా నిలిచేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకొస్తున్నారు. కేరళ వరద బాధితుల సహాయార్థం జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ 2 నెలల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఒక నెల వేతనం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.