సంగారెడ్డి : మెదక్ మాజీ ఎంపీ మానిక్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఆందోల్ మండలం డాకూర్ లోని నివాసానికి వెళ్లి.. మానిక్ రెడ్డి భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. మానిక్ రెడ్డి కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్, హరీశ్ రావు ఓదార్చారు. మానిక్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ని ప్రార్థించారు.