ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భద్రాచలం రామాలయం వద్ద పడమర మెట్ల వరకు చేరిన వర్షపునీరు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 20, 2018, 11:02 AM

భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నది. రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో... పెద్దవాగు ప్రాజెక్టు కట్టపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నది. సురక్షిత ప్రాంతాలనికి దిగువ ప్రాంత ప్రజలు తరులుతున్నారు. పాలేరు నియోజకవర్గంలో 50కి పైగా చెరువులు మత్తడి పోస్తున్నాయి. దీంతో వైరా జలాశయం ఉధృతంగా ప్రవహిస్తున్నది. వైరా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం దాటి వరద నీరు ప్రవహిస్తున్నది. వైరా జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 18.4 అడుగులు.అటు మణుగూరులో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి.. మణుగూరులో 3 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో 43.5 అడుగులకు నీటిమట్టం చేరింది. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. కొత్తకాలనీలో పలు ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. రామాలయం వద్ద పడమర మెట్ల వరకు చేరిన వర్షపునీరు వచ్చి చేరింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com