భద్రాద్రికొత్తగూడెం: ఆదివారం రాత్రి నుంచి జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అశ్వారావుపేట మండలంలో నారాయణపురం నుంచి బచ్చువారిగూడెం వెళ్లే దారిలో బ్రిడ్జికి అటువైపు, ఇటువైపు ఆర్ అండ్ బీ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో వేలేరుపాడు- అశ్వారావుపేటకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.