కొత్తపల్లి: కొత్తపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో పోలీసులు సోమవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 5గంటల నుండి 7గంటల వరకు ఇళ్లలో, ప్రతి అనుమానిత ప్రాంతంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. వర్షం కురుస్తున్నా ప్రజలు తమవంతు సహాకారం అందించారు. సిసి కెమెరాల ఏర్పాటు కు 1.5లక్షల విరాళాన్ని అందించారు. తనిఖీల్లో రెండు ఇసుక ట్రాక్టర్లు, సరైన ధ్రువపత్రాలు లేని మూడు ఆటోలు, 15 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి, అడిషనల్ డిసిపి పి సంజీవ్ కుమార్, ఏసిపి ఉషారాణి, రూరల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, కొత్తపల్లి ఎస్ఐ స్వరూప్ రాజ్ లతో పాటుగా వివిధ విభాగాలకు చెందిన 150 మంది పోలీసులు పాల్గొన్నారు.