హైదరాబాద్: స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన నేత రాజీవ్గాంధీ అని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. సోమాజిగూడలో జరిగిన రాజీవ్గాంధీ జయంతి కార్యక్రమంలో జానారెడ్డి మాట్లాడారు. ఆర్థిక సంస్కరణలు, మతసామరస్యానికి రాజీవ్గాంధీ కృషి చేశారని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. కాంగ్రెస్పై టీఆర్ఎస్ నేతలు అవాకులు పేలుతున్నారని విమర్శించారు.